ప్రజా సేవ కోసమే ఎన్నికల్లో పోటీ

02-05-2024 12:46:22 AM

మల్కాజిగిరి స్వతంత్ర అభ్యర్థి వైష్ణవీప్రసాద్

ఎల్బీనగర్, మే 1 (విజయక్రాంతి): ప్రజలకు సేవ చేయడానికే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నానని స్వతంత్ర అభ్యర్థి వైష్ణవీప్రసాద్ తెలిపారు. కొత్తపేట డివిజన్‌లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. తనను గెలిపిస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదర్శ పాఠశాల, ఆస్పత్రిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించడానికి కార్యాలయాలను ప్రారంభిస్తానని పేర్కొన్నారు. ప్రచారంలో నాయకులు సుబ్రహ్మణ్యం, రాజేశ్వర రావు, విశ్వనాథం, కైలాస్ తదితరులు పాల్గొన్నారు.