20-05-2025 12:16:25 AM
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం
కామారెడ్డి, మే 19 (విజయ క్రాంతి ): ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై అర్జీలు అందాయి. ఈ రోజు ప్రజావాణి లో 96 దరఖాస్తులు పలు శాఖలకు సంబంధించినవి వచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి ఆయా శాఖల అధికారులు సాధ్యా సాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా పెండింగులో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తు దారునికి రాత పూర్వకంగా సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ వీణ, పలు శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.