21-06-2025 04:34:56 PM
మండల వైద్యాధికారి స్రవంతి...
పెన్ పహాడ్: నిత్యం యోగ చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సాధిస్తారని మండల వైద్యాధికారి స్రవంతి(Mandal Medical Officer Sravanthi) అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. వైద్యాధికారి డా..K స్రవంతి మాట్లాడుతూ.. ఈ యోగా ఆరోగ్య ప్రక్రియను అందరూ అనుసరించడం, పాటించడం వలన శారీరక, మానసిక వత్తిడులు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటారన్నారు. కాగా ఆయుష్ వైద్యాధికారి డా.రామ్ ప్రసాద్ పలు యోగాసనాలపై అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమం లో PHC సూపర్ వైజర్స్ సైదులు ఫ్న్ శశిరేఖ, HEO చంద్రశేఖర్ రాజు, స్టాఫ్ నర్ష్, ఏఎన్ఎం లు, ఆశాలు ఉన్నారు