21-06-2025 04:36:44 PM
మందమర్రి (విజయక్రాంతి): 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) వేడుకలు సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగ దినోత్సవంను పురస్కరించుకొని ఏరియా లోని అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో, జనరల్ మేనేజర్ కార్యాలయంలో శనివారం యోగ కార్యక్రమాలు నిర్వహించారు. జిఎం కార్యాలయంలో అంతర్జాతీయ యోగా కార్యక్రమాలను ఏరియా జిఎం జి దేవేందర్ ప్రారంభించి మాట్లాడారు. మానవులు తమ దైనందిన జీవితంలో ప్రతి రోజూ ఒక గంట సమయాన్ని కేటాయించి యోగ సాధన చేయాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు.
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉంటేనే ఇమ్యూనిటీ పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సింగరేణి సంస్థ మూడుపువ్వులు, ఆరుకాయలుగా ఉత్పత్తి ఉత్పాదకత, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జిఎం విజయ ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రెటరీ సలేంద్ర సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ ఈ అండ్ ఎం వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సిఎంఓఏఐ అధ్యక్షులు రమేష్, సీనియర్ పిఓ శంకర్, అధికారులు, ఉద్యోగులు , యోగ మాస్టర్ ముల్కల శంకర్ లు పాల్గొన్నారు.
లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో..
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యోగ కార్యక్రమాలను లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు స్వరూప రాణి- దేవేందర్ ప్రారంభించారు. అనంతరం ఆమే మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు తమ దిన చర్యలో యోగాను భాగం చేసుకుని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ సభ్యులు యోగ మాస్టర్లు పాల్గొన్నారు.