టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడికి పరామర్శ
18-03-2026 02:59 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా TNGO అధ్యక్షులు ప్రభాకర్ అనారోగ్యానికి గురి కావడంతో బుధవారం నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఇటీవలే ప్రమాదవశాత్తు గాయపడగా స్వగృహంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట నాయకులు కౌన్సిలర్ SP రాజు, మాజీ కౌన్సిలర్ తారక రఘు,మరియు కాంగ్రెస్ నాయకులు ముడుపు సత్యనారాయణ,కొంతం గణేష్, ఆకుల హరీష్, మూట సురేష్, బొర్ర ఉమేందర్, అడపా శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.




