09-12-2025 12:40:19 AM
వేములవాడ, డిసెంబర్ 08, (విజయ క్రాంతి):వేములవాడ పట్టణానికి చెందిన సీ నియర్ పాత్రికేయుడు దాసరి దేవేందర్ తండ్రి దాసరి ఎల్లప్ప ఇటీవల అనారోగ్యం తో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో వారి స్వగ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా, వెంకంపేటకు సోమవారం బీఆర్ఎస్ పార్టీ వేముల వాడ నియోజకవర్గం ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు వెళ్లి,జర్నలిస్టు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూ తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన కు టుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారి తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నా యకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సె స్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, పోతు అనిల్ కుమార్, పాత్రికేయులు హింగే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.