calender_icon.png 30 June, 2025 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదాసి ఉమారాణికి అభినందనలు

30-06-2025 02:44:29 AM

సనత్ నగర్, జూన్ 29 (విజయ క్రాంతి): బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానం బోర్డు స భ్యురాలిగా గోదాసి ఉమారాణి  నియమితులవ డాన్ని గర్వకారణంగా పేర్కొం టూ, గండిపేట కార్పొరేటర్ గోపాల గణేష్, గోపాల సు నీత, సుగంధ పుష్పలత ఆమెను కలిసి హృ దయపూర్వకంగా అభినందించారు.

ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ ‘గోదాసి ఉ మారాణి  సామాజిక సేవలో ఎంతో చురుకైన వ్యక్తిగా, మహిళా అభ్యున్నతికి నిబద్ధత తో పని చేసే వ్యక్తిగా మా అందరికీ సుపరిచితురాలు. ఆమెకు ఈ బోర్డు సభ్యత్వం లభిం చడం అత్యంత గర్వకారణం. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యానికి ఆమె అంకి తభావంతో పనిచేస్తారని మా కు నమ్మకం ఉంది‘ అని తెలిపారు.

అలాగే భవిష్యత్తులో ఆలయ నిర్వహణలో పారదర్శకత, సద్వినియోగం, సంక్షేమ కార్యక్రమాల ప్రోత్సాహా నికి ఉమారాణి సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సంద ర్భం గా గోదాసి ఉమారాణి ‘ఈ గౌరవాన్ని నాకు అందించిన వారందరికీ ధన్యవాదాలు. దేవస్థాన అభివృద్ధి, భక్తుల అభ్యున్నతి కోసం నే ను నిరంతరం కృషి చేస్తాను’ అని అన్నారు.