13 March, 2026 | 4:11 PM

కన్నెపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి మున్నాబీ ఏకగ్రీవం..

02-12-2025 10:10 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో నామినేషన్ చివరి రోజు కన్నెపల్లి మండలంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. ముత్తాపూర్‌ గ్రామ పంచాయతి సర్పంచ్ గా ఎండి మున్నాభీ అంకూస్ నామినేషన్ వేశారు. ఇతరులు ఎవరు నామినేషన్ వేయలేదు. దీంతో ముత్తాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మున్నాబి అంకూష్ ఏకగ్రీవమయ్యారు.