26 April, 2026 | 7:44 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

అబద్ధపు హామీలతో కాంగ్రెస్ మోసం

11-05-2024 12:05 AM

ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి 

మహబూబ్‌నగర్, మే 10 (విజయక్రాంతి): అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తోందని మహబూబ్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జామియా మసీదు వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ముస్లింల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపాలని కోరారు. ప్రచారంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.