నేడు చెన్నూర్కు కేటీఆర్
ప్రజా ఆశీర్వాద సభకు హాజరు
ఏర్పాట్లు పరిశీలించిన బాల్క సుమన్
మంచిర్యాల, మే 10 (విజయక్రాంతి): ఎన్నికల ప్రచారంలో భాగం గా చెన్నూర్లో శనివారం నిర్వహించే ప్రజాఆశీర్వాద సభకు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హాజరుకానున్నట్టు బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు. చెన్నూర్ జడ్పీ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న సభ ఏర్పాట్లను శుక్ర వారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో కుటుంబ పాలన సాగుతుందని, తిరిగి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే వారి ఆగడాలకు అంతులేకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సింగరేణి కార్మికుడైన ఈశ్వర్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.






