మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పరామర్శ
28-10-2025 05:33 PM
ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మండల రాజమల్లు ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబాన్ని ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ పరామర్శించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి నివాళులర్పించారు. అధ్యక్షుడి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.






