15 June, 2026 | 7:58 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

ఉప సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న వార్డు సభ్యులు

19-12-2025 09:13 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కితవారిగూడెంలో గ్రామపంచాయతీ ఉపసర్పంచిగా చిత్తలూరు వీరస్వామిని కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపిటిసి షేక్ చాంద్ మియా మాట్లాడుతూ... గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితో పాటు గ్రామ అభివృద్ధికి వార్డు సభ్యులు కృషి చేయడంతో పాటు గ్రామాన్ని ఆదర్శ పథంలో నడిపించాలని ఆయన కోరారు.

అనంతరం ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన ఉపసర్పంచ్ విరస్వామిని చాంద్ మియా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బండారు సైదులు,ముత్తినేని హరిబాబు, షేక్ సఫియామీరా, గుండు పూలమ్మ సైదులు, బండారు అంజయ్య, గూడెపు వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ సుబ్బయ్య, మాజీ ఎంపిటిసి కీత మట్టయ్య, కీత సునీత రామానాధం, రామకృష్ణ, సురేష్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.