15 July, 2026 | 3:33 PM

Breaking News

దేశంలో విద్యా విధానాన్ని కేంద్రం వ్యాపారంగా మార్చింది: మహేశ్ గౌడ్   •   మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగ్గారెడ్డి భేటీ.. తుంగతుర్తి అంశాలపై చర్చ!   •   నాటు సారా పట్టివేత... ఒకరి అరెస్ట్   •   మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వండి   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం   •   భవిష్యత్తులో ఏఐ హబ్‌గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు   •   భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ‘భూభారతి’ రీ సర్వే   •   సీఎం ప్రోగ్రాం బాయ్ కోట్   •   ఆర్‌ఎంపీ & పీఎంపీ వైద్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యం   •   సోనాల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించండి.. కలెక్టర్ ను కోరిన సర్పంచ్   •  

తెలంగాణ నీళ్లు దోచుకునే కుట్ర

08-06-2024 01:25 AM

బీఆర్‌ఎస్ నేత సతీశ్‌రెడ్డి 

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి):  సీఎం పదవిలో ఉండి రాష్ట్ర నీటి హక్కులను పొరుగు రాష్ట్రాలకు అప్పగించేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి విమర్శించారు. అందులో భాగంగానే ఇరిగే షన్ సలహాదారుడిగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమించారని పేర్కొ న్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా  కృష్ణబోర్డుకు ఫిర్యాదులు చేసిన వ్యక్తిని రాష్ట్ర జలవనరుల సలహాదారుడిగా నియమించడం దుర్మార్గమ న్నారు.  గురుశిష్యులు కలిసి తెలంగాణ నీళ్లను మింగేసే కుట్ర చేస్తు న్నారన్నారు.    రేవంత్‌కు రాష్ట్రంపై ప్రేమలేదనేదని స్పష్టమవుతోందని పేర్కొన్నారు.