30-05-2025 12:00:00 AM
ఎస్పీ డా.జానకీ షర్మిల
నిర్మల్, మే 29 (విజయక్రాంతి):నిర్మల్ జిల్లాలో బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమంగా గోవుల తరలింపు అడ్డుకున్నందుకు జిల్లాలో ఏడు చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు గురువా రం నిర్మల్ జిల్లాలో సరిహద్దు ప్రాంతాలతో పాటు జాతీయ రహదారులపై ఏర్పాటు చేసి న చెక్ పోస్ట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ....
నిర్మల్ జిల్లాలో గోవుల అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లా, సరిహద్దులో 07 చెక్ పోస్టులు ఏర్పా టు చేయడం జరిగింది. 24x7 నిరంతర పర్యవేక్షణలో వుండేవిధంగా ప్రత్యేక చెక్ పోస్టులలో పోలీసు, పశుసంవర్ధక శాఖ సిబ్బందితో షిఫ్ట్ ల వారిగా సమన్వయంతో విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు చర్యలలో భాగంగా గోవుల రవాణా విషయంలో వివాదాలు తలెత్తకుండా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆవులు, దూడలను రవాణా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.
గోవులను రవాణాచేసే ప్రతి వాహనానికి తగు నిర్థారిత ప్రమాణిక పత్రాలు (వాలిడ్ డాక్యుమెంట్స్) ఉండాలని స్పష్టం చేశారు. సరిహద్దు రాష్ట్రా ల నుండి రవాణా అయ్యే గోవుల విషయంలోనూ నియమ, నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.
సామాజిక మాధ్యమాల ద్వారా మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా విద్వేషాలు, రెచ్చగొట్టే, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా ముఖ్య కార్యాలయంలో సోషల్ మీడి యా సెల్ పరిశీలన చేస్తుంటారని తెలిపారు. చెక్ పోస్టుల తనిఖీలే కాకుండా జిల్లా కేంద్రంలో సైతం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని ఎస్పీ వెల్లడించారు.