28 March, 2026 | 5:06 PM

Breaking News

మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •  

సిసి మార్కెట్లను తెరవాలని పత్తి రైతుల డిమాండ్

08-10-2025 08:24 PM

చిట్యాల (విజయక్రాంతి): పత్తి రైతుల కష్టాలను తెలుసుకొని తక్షణమే సిసి మార్కెట్లను తెరవాలని చిట్యాల మండల పత్తి రైతులు బుధవారం అధికారులను డిమాండ్ చేశారు. పత్తి పంటపై చీడపురుగుల ప్రభావం తీవ్రంగా ఉండడం వలన పంట పూర్తిగా దెబ్బతిని రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఎరువులకు, క్రిమిసంహారకాలకు, పంట సాగుకు అధిక మొత్తంలో అప్పులు చేసి పెట్టుబడి పెట్టి నష్టపోయామన్నారు. మరోవైపు అకాల వర్షాల వలన పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నదని, చేనులోని పత్తి తడిసి పూర్తిగా రైతులకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక మొత్తంలో రైతులు పత్తి పంటను సాగు చేయడం వలన కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అధికారులు స్పందించి వెంటనే రైతులకు పత్తి అమ్ముకోవడానికి తక్షణమే సిసి మార్కెట్ తెరవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని రైతుల పక్షాన కన్నెబోయిన మహాలింగం తెలిపారు.