12 June, 2026 | 5:31 PM

Breaking News

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •  

నకిలీ డీడీలతో ఇసుక మాఫియా

08-10-2025 10:35 PM

అశ్వాపురం పోలీసుల వలలో లారీ..

అశ్వాపురం (విజయక్రాంతి): మణుగూరు మండలం రామానుజవరం ఇసుక ర్యాంపు నుంచి బుధవారం నకిలీ డీడీలతో నాలుగు లారీలు బయలుదేరినట్లు అధికారులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో, అందులో ఒక లారీని అశ్వాపురం పోలీసు స్టేషన్ సమీపంలో పోలీసులు అడ్డుకుని పట్టుకున్నారు. మిగతా మూడు లారీలు కొత్తగూడెం వైపు తరలినట్లు సమాచారం. ఇసుక రవాణాకు సంబంధించి సరైన పత్రాలు లేకుండా నకిలీ డీడీలతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మాఫియాపై పోలీసులు దృష్టి సారించారు. పట్టుబడిన లారీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు అశ్వాపురం పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ సంఘటనతో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు నిఘా మరింత పెంచనున్నారు.