12 June, 2026 | 2:20 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

ప్రమాదాల్లో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

08-10-2025 10:40 PM

కందుకూరు: మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం ఎన్టీఆర్ తండాలో పలు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను బుధవారం మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు పి.సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తండాకు చెందిన మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్ నాయక్ ఇటీవల ప్రమాదవశాత్తు కాలికి తీవ్ర గాయాలు కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారని, అలాగే అదే తండాకు చెందిన శీను నాయక్ కుమారుడు చిన్న వయసులో జరిగిన ప్రమాదంలో కోమాలోకి వెళ్లి ఇటీవలే కోలుకున్నారని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన బాధితులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శీను నాయక్ కుమారుడికి పెన్షన్ లేదా ఆర్థిక సహాయం అందించే విధంగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డితో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండలానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, తండా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.