8 March, 2026 | 3:19 PM

Breaking News

అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •   గోపాలరావుపల్లెలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు   •  

అర్ధరాత్రి నగరంలో సీపీ తనిఖీలు

08-10-2025 01:13 AM

 పరువురికి కౌన్సిలింగ్ హెచ్చరిక 

నిజామాబాద్ అక్టోబర్ 7 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో  శాంతి భద్రతల పరిరక్షణకై ప్రతిష్టమైన చర్యలు చేపడుతున్న నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక  తనిఖీలు నిర్వహించారు.  నగరంలోని పలు ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్ బస్టాండ్ లలో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించారు.  అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రధానమైన  రైల్వే స్టేషన్ , ఆర్టిసి బస్టాండ్ , గాంధీచౌక్ , నెహ్రూ పార్క్, శివాజీ నగర్ , కంటేశ్వర్,  దేవీ రోడ్డు , ఫ్లై ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.   

నిజామాబాద్ జిల్లాతో పాటు నగరం లో ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా బయటి ప్రాంతాలలో నుండి వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ ఆర్టిసి బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఉంటూ ఎలాంటి కారణము లేకుండా బయట తిరుగుతున్న వారిని సైతం సిపి తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా అసందర్భంగా కనిపించిన వారందరికీ  కౌన్సిలింగ్  నిర్వహించారు.  రాత్రి సమయాలలో మళ్లీ కనిపిస్తే వారిపై చట్టపరమైన కేసులు నమోదుచేస్తామని సిపి హెచ్చరించారు.