అర్ధరాత్రి నగరంలో సీపీ తనిఖీలు
పరువురికి కౌన్సిలింగ్ హెచ్చరిక
నిజామాబాద్ అక్టోబర్ 7 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకై ప్రతిష్టమైన చర్యలు చేపడుతున్న నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్ బస్టాండ్ లలో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రధానమైన రైల్వే స్టేషన్ , ఆర్టిసి బస్టాండ్ , గాంధీచౌక్ , నెహ్రూ పార్క్, శివాజీ నగర్ , కంటేశ్వర్, దేవీ రోడ్డు , ఫ్లై ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లాతో పాటు నగరం లో ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా బయటి ప్రాంతాలలో నుండి వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ ఆర్టిసి బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఉంటూ ఎలాంటి కారణము లేకుండా బయట తిరుగుతున్న వారిని సైతం సిపి తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా అసందర్భంగా కనిపించిన వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. రాత్రి సమయాలలో మళ్లీ కనిపిస్తే వారిపై చట్టపరమైన కేసులు నమోదుచేస్తామని సిపి హెచ్చరించారు.




