7 April, 2026 | 5:06 PM

Breaking News

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం   •   చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు   •   గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక   •   పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్   •   'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్‌ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌   •   గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ   •   రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ   •   ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు   •   పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్   •   ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్   •  

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సీపీ సందర్శన

14-05-2024 01:59 AM

మంచిర్యాల, మే 13 (విజయక్రాంతి): జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను రామగుండం సీపీ శ్రీనివాస్ సోమవారం పరిశీలించారు. కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పంగిడి సోమారంలోని స్కూల్, చెన్నూర్ ప్రభుత్వ పాఠశాల, బెల్లంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, రాపన్‌పల్లిలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ, మంచిర్యాల, జైపూర్ ఏసీపీలు, సీఐలు ఉన్నారు.