కరీంనగర్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతునిస్తున్నట్లు గురువారం సీపీఐ జిల్లా కమిటీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు కరీంనగర్లో ని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో తమ పార్టీ భాగస్వామిగా ఉన్నందున తాము కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు మాట్లాడు తూ.. సీపీఐ, కాంగ్రెస్ నాయకులు కలిసి తన గెలుపు కోసం పనిచేయాలని కోరారు. వారి వెంట మాన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సీపీఐ జిల్లా నేతలు మర్రి వెంకటస్వామి, గుంటి వేణు, కేదారి, మల్లేష్, శ్రీనివాస్, అశోక్ ఉన్నారు.