02-02-2026 12:00:00 AM
సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 1: క్రియేటివ్ టీ చర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో నూ తన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా లింగ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ముక్క రమేష్, ఆర్థిక కార్యదర్శిగా తాళ్ల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా మహిపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, భగవాన్ రెడ్డి, శివకుమార్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు లింగ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏకగ్రీవంగా ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
సమాజంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికల అధికారులుగా ముండ్రాతి రమేష్, కల్లేపల్లి శ్రీనివాస్ వ్యవహరించారు. సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు జైన సత్యం, మాజీ అధ్యక్షుడు రచ్చ జగన్ పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ పొందిన 38 మంది సంఘ సభ్యులను ఘనంగా సన్మానించారు.