30-05-2025 08:28:48 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్స్ అన్ని నిండిపోయి వెలుపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు శుక్రవారం ప్రకటించారు. 69,019 మంది భక్తులు నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 37,774 మంది భక్తులు నిన్న తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.42 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.