calender_icon.png 30 June, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా హిందూ సేవా సమితి సాంస్కృతిక కార్యక్రమాలు

30-06-2025 02:47:26 AM

ఖైరతాబాద్; జూన్ 29 (విజయ క్రాంతి): యూసఫ్ గూడా లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆదివారం హిందూ సేవా సమితి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దుర్గా మైత్రేయి నేతృత్వంలో  నిర్వహించిన 100 మందికి వీణ కార్యక్రమం, 150 మంది తో భాగవద్గీత పారాయణం, 250 మందితో కూచిపూడి నృత్య ప్రదర్శన ముఖ్య ఆకర్షణగా నిలిచాయి. 

ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వేణు గోపాల చారి, మాజీ ఎమ్మెల్సీ నల్లూరి రామచంద్రరావు, భట్టి విజయసారథి, గంగాధర్ శాస్త్రి తదితరులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సంస్కృతిక కార్యక్రమాల ద్వారా సామాజిక సమరసత, సాంస్కృతిక చైతన్యం పెంపొందుతుందని అన్నారు.సమాజంలోని అన్ని వర్గాలు పాల్గొని ఈ పవిత్ర సదసుకు తోడ్పాటును అందించాలనీ వారు కోరారు .

అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఫిలిప్పీన్స్ తదితర దేశాల నుంచి కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హిందూ సేవా సమితి నూతన అధ్యక్షుడిగా డి.వి. రాధాకృష్ణ, ఉపాధ్యక్షుడిగా బి.సి.ఎ స్.వి. సుబ్రహ్మణ్యం, కార్యదర్శిగా  నిర్మల, సం యుక్త కార్యదర్శిగా లక్ష్మణ్, ఖజాంచీగా  నాగ శిరోమణి సభ్యులు  ఏ. దుర్గా మైత్రేయి, ఎం. రవి కిరణ్, ఎం. సుబ్రహ్మణ్యం, టి. రాజ్ కుమార్ తదితరులు బాధ్యతలు స్వీకరించారు.