15 March, 2026 | 9:30 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

దల్జీత్‌కు కెనడా దాసోహం

16-07-2024 02:10 AM
  • చరిత్ర సృస్టించిన పంజాబీ సింగర్ దల్జీత్ దోసాంజ్ 
  • కెనడాలోని రోజర్స్ సెంటర్‌లో 50వేల అభిమానుల మధ్య ప్రదర్శన 
  • స్వయంగా హాజరై అభినందించిన ప్రధాని

న్యూ ఢిల్లీ, జూలై 15: దల్జీత్ దోసాంజ్ కెనడాను ఊపేస్తున్నాడు. టోరంటోలో అతడి షోకు దాదాపు 50వేల వరకు ప్రేక్షకులు అటెండ్ అవ్వడం ఇప్పడు సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అతడి ప్రదర్శనకు సంబంధించిన ఓ వీడియోను సోమవారం కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. కెనడా ప్రధానమంత్రి ట్రూడో.. దల్జీత్ షోకు ప్రత్యక్షంగా హాజరవ్వడంతో పాటు దిల్జీత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి అభినందించారు. అలాగే దిల్జీత్ టీమ్‌తో కూడా మాట్లాడి వారిని ఉత్సాహపరిచారు. ఇదే వీడియోలో దిల్జీత్ టీం సభ్యుల మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో ‘పంజాబీ ఆగయే ఓయే’ అని టీమ్ మొత్తం గట్టిగా చెప్పడంతో స్టేడియం దద్దరిల్లింది. దిల్జీత్ మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వం కెనడా బలం అని అన్నారు.