7 March, 2026 | 2:12 PM

మంత్రి దుద్దిళ్లను కలిసిన డీసీసీ అధ్యక్షుడు ధారా సింగ్ నాయక్

24-11-2025 12:00 AM

తాండూరు, నవంబర్ 23 , (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ  నూతన అధ్యక్షుడుగా నియామకమైన ధారాసింగ్ జాదవ్ నేడు హైదరాబాద్లోని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి,  రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మల్కూర్‌లను తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పార్టీ పెద్దలు సూచించారని ధారసింగ్ నాయక్ తెలిపారు.