24 June, 2026 | 12:33 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

పోలింగ్ సరళి, ఓట్ల లెక్కింపును పరిశీలించిన డీసీపీ రాంరెడ్డి

17-12-2025 07:53 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం పెద్దపల్లి డీసీపీ బి. రాంరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్ తో కలిసి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి పోలింగ్ సరళి, ఓట్ల లెక్కింపును పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సీసీ కెమెరాలను స్థానిక ఠాణాకు అనుసంధానం చేశారు. ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్న డీసీపీ రాంరెడ్డి ఠాణా నుంచే పోలింగ్ కేంద్రాల పరిస్థితిని సమీక్షించారు.

అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేశారు. మండలంలోని సమస్యాత్మక కేంద్రాల్లో ముందస్తుగా భద్రతా బలగాలను మోహరించారు. గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలను తీయవద్దని పేర్కొన్నారు. అలాగే సుల్తానాబాద్ మండలంలోని గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎసిపి జీ, కృష్ణ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ లు పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.