15-10-2025 12:00:00 AM
బంజారహిల్స్లో ప్రారంభించిన గాయని గాయత్రీ వేదాంతం
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 13 (విజయక్రాంతి): బంజారాహిల్స్ రోడ్ నెంబర్ గల లేబుల్స్ పాప్ -అప్ స్పేస్లో ఏ ర్పాటైన డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ సినీ నేపథ్య గాయని గా యత్రీ వేదాంతం సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ‘విభిన్నమైన పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్, సిల్క్ వస్త్రోత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభి నందనీయమని ఆమె అన్నారు.
నేరుగా వీవ ర్ నుంచి వినియోగదారునికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని గాయత్రి వేదాంతం కో రారు. డి సన్స్ పటోలా ఆర్ట్స్ నిర్వాహకులు భవిన్ మాట్లాడుతూ.. “ఈ నెల 18వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో ప్రత్యేక కలెక్షన్స్ వేదికగా పటాన్ పటోలా, బంధనీ, బనారసీ, కాశ్మీరి, మహేశ్వరీ, కంచిపురం, గద్వాల్, లక్నోవీ, అజ్రక్ చీరలు, సూట్లు, కుర్తీలు, డ్ర స్ మెటీరియల్, బెడ్షీట్లు, ఆభరణాలు అం దుబాటులో ఉంచామని వివరించారు. నేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనే త పరిశ్రమకు మార్కెట్ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన లక్ష్యమన్నారు.