22 April, 2026 | 2:10 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

ఇమామ్ మౌజన్ ల వేతనాల పునరుద్ధరణకు గడువు పొడిగించాలి

27-07-2025 08:49 PM

మైనారిటీ జిల్లా అధ్య క్షులు ఎండీ. యాకూబ్ పాషా..

కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్రంలోని మసీదులలో సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజన్‌ల గౌరవ వేతనాలను పునరుద్ధరణ చేసేందుకు గడువు తేదీని నెల రోజుల పాటు పొడగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా(Minority Welfare Association President MD Yakub Pasha) ఆదివారం నాడు ఒక ప్రకటనలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులను కోరారు. గౌరవ వేతనాలను కొనసాగించటానికి పాన్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని అధికారులు చెప్పటంతో వీటిని పొందేందుకు ఇమామ్ మౌజన్ లు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. ఆదాయ దృవీకరణ పత్రం పొందేందుకు రేషన్ కార్డు తప్పనిసరి అయినందున, చాలా మంది ఇమామ్, మౌజన్ లకు రేషన్ కారణంగా, ఆదాయ దృవీకరణ పత్రం పొందటం తలకు మించిన భారంగా ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అదాయ ద్రువీకరణ పత్రంను మినహాయించాలని అన్నారు. ఈ మేర కు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శికి లేఖలు కూడా రాయడం జరిగిందని యాకూబ్ పాషా విలేఖరులకు తెలియజేశారు.