calender_icon.png 7 June, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీలర్లు రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి

05-06-2025 12:31:33 AM

కృష్ణ, జూన్ 4. రైతులకు సరిపడా ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉంచాలని మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌ డ్ డీలర్లకు సూచించారు. ఈ సందర్భంగా మండలంలోని గుడెబల్లూర్ పంచాయతీ పరిధిలో టైరోడ్లో గల విత్తనాలు ఎరువుల దుకాణాలు శ్రీరామ్ ట్రేడర్స్, ఆగ్రో రైతు సేవ కేంద్రం మరియు వరలక్ష్మి ట్రేడర్స్ లో ఎస్త్స్ర ఎస్ ఎం నవీద్ తో కలిసి బుధవారం తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ డీలర్లు రైతులకు అమ్మే విత్తనాలను ఎరువులు ఎం ఆర్ఫీ ధరకే అమ్మాలని, వారికి తప్పకుండా రసీదులు ఇవ్వాలని లేనియెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.