14-06-2025 01:01:07 AM
- చితాభస్మాన్ని నర్మదాలో కలిపేందుకు బ్రిటన్ నుంచి రాక
- తిరుగుప్రయాణంలో విమాన ప్రమాదంలో అర్జున్ మృతి
న్యూఢిల్లీ, జూన్ 13: అహ్మదాబాద్ విమాన ప్రమాదం లో చనిపోయిన వా రిది ఒక్కొక్కరిది ఒక్కోగాథ. మృతుల్లో ఒకరైన అర్జున్ పటోలియా (36) భార్య తో కలిసి బ్రిటన్లో ఉంటున్నాడు. వా రం రోజుల క్రితం లండన్లో ఆయన భా ర్య భారతీబెన్ అనారోగ్యంతో మృతిచెందగా, ఆమె చివరి కోరిక మేరకు చితాభ స్మాన్ని నర్మదానదిలో కలిపేందుకు భారత్కు వచ్చాడు.
తన బంధువులతో కలిసి వాడియాలో భార్య చితాభస్మాన్ని నర్మదానదిలో కలిపాడు. అనంతరం గు రువారం అ హ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరగా, కొద్దిసేపటికే విమాన ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు అర్జున్కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారం వ్యవధిలోనే తల్లీదండ్రులిద్దరూ మృతిచెంద డంతో ఆ పిల్లలు అనాథలయ్యారు.