calender_icon.png 30 December, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్తాపూర్‌లో జింక మాంసం కలకలం

30-12-2025 02:10:42 PM

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని అత్తాపూర్‌లో(Attapur) జింక మాంసం అమ్మకం కలకలం రేగింది. సమాచారం అందుకున్న  రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు జింక మాంసం(Deer Meat Sale ) అమ్ముతుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై వైల్డ్‌లైఫ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 15 కిలోల జింక మాంసం స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.