26 May, 2026 | 5:32 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

రెవెన్యూలో జూనియర్ అసిస్టెంట్ల శిక్షణ కాలాన్ని నిర్ణయించండి

15-10-2025 08:00 PM

కాటారం,(విజయక్రాంతి): రెవెన్యూ శాఖలో విలీనం కాబడిన 43 మంది జూనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తున్న ఉద్యోగులకు శిక్షణ కాలాన్ని నిర్ణయించి, వారిని పూర్తిస్థాయి ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు మార్క రామ్మోహన్ గౌడ్ కోరారు. ఈ మేరకు బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్లుగా, మరికొంతమందిని లష్కరులుగా నియమించారని, రెండేళ్లు గడుస్తున్నా,  ఇప్పటివరకు వారికి ఎలాంటి ప్రొబేషన్ పీరియడ్ ను డిక్లేర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సీసీఎల్ఏ అధికారుల నుంచి మార్గనిర్దేశకాలను తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సూచనల ప్రకారం జిల్లా కలెక్టర్ ప్రొబేషన్ పీరియడ్ ను గుర్తించడానికి అవకాశం ఉందని రామ్మోహన్ తెలిపారు. ఇప్పటికైనా జిల్లాలో వివిధ మండలాలలో పనిచేస్తున్న 43 మంది రెవెన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంట్ లను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని మార్క రామ్మోహన్ గౌడ్ కోరారు.