calender_icon.png 23 September, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే కృషితో అభివృద్ధి నిధులు

23-09-2025 06:07:12 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కుస్తుని నిర్మల్ పట్టణానికి నిధులు మంజూరైనట్టు బిజెపి నాయకులు వెల్లడించారు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు తదితరులు మాట్లాడారు. బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి కృషితో గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి కుంటుపడిన నిర్మల్ పట్టణ అభివృద్ధికి 57 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు నిర్మల్ పట్టణంలోని అంతర్గత సీసీ రోడ్లు , డ్రైనేజ్ ల నిర్మాణానికి 15 కోట్లు, కేంద్ర ప్రభుత్వ స్వచ్ భారత్ మిషన్ పథకం ద్వారా పట్టణంలో STP ప్లాంట్ ల (మురుగునీటి శుద్ధి కేంద్రాలు) కు 42 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఘనత మహేశ్వర్ రెడ్డి గారికి చెందుతుందన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యంతో పట్టణంలోని కాలనీలు అంభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. నిర్మల్ కు దిక్సూచి గా ఉన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు నియోజక అభివృద్ధికి వందల కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ లు, బిటి రోడ్లు ఇలా మారుమూల గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక  ఎమ్మెల్యే గారిపై అసత్య, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇకనైన తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు.