calender_icon.png 20 June, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

20-06-2025 12:37:59 AM

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట, జూన్ 19 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట జడ్పీ హైస్కూల్లో పదో తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గురువారం జడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు గోల్డెన్ బాయ్స్  ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహకాలు అందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యంత శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పద్దతిలో భోధన  అందిస్తున్నారని కావున పేదలు  ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం  ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా నోట్ బుక్స్, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనము  ఉచితంగా అందిస్తుంద న్నారు. తదుప 2024 సంవత్సరంలో పాఠశాలలో పదవ తరగతి పరిక్షలలో  మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని మహాలక్ష్మికి లక్ష రూపాయల నగదు, ప్రశంస పత్రంను పాఠశాలలో  హింది ఉపాధ్యాయులుగా పనిచేసిన సుగుణ జ్ఞాపకార్థం వారి కుమారులు  సంతోష్ , సహకార్ సజీవ్ లు అలా చేశారు.

అలాగే రెండవ ర్యాంక్ విద్యార్దిని  సిరి ప్రియకు  రూ.50,000 లను నంద్యాల రవీందర్ రెడ్డి,   మూడవ ర్యాంకు సాధించిన విద్యార్దిని కోమలి కి   రూ.20,000 లను కొప్పుల రవీందర్ రెడ్డి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నగదు,  ప్రసంశా పత్రం ఆందజేశా రు. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు  స్పోరట్స్ షూ లను తమ స్వంత ఖర్చులతో అందజేస్తానని వేణారెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ గోలి పద్మ, విద్యార్థులు, తల్లిదం డ్రులు,   ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.