06-12-2025 12:00:00 AM
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
సదాశివపేట, డిసెంబర్ 5 : సదాశివపేట మండలం నందికంది, కోనాపుర్ గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థుల తరపున టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నందికంది గ్రామం లో భారీ ర్యాలీ నిర్వహించారు. నందికంది సర్పంచ్ అభ్యర్థి రేచర్ల స్రవంతి విజయ భాస్కర్ రెడ్డి తరపున ఆమె ఇంటింటి కి వెళ్లి తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం కోనాపూర్ గ్రామం లో సర్పంచ్ అభ్యర్థి చిరంజి దశరథ్ తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థిని గెలిపిస్తే నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సిడీసి చైర్మెన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడీల రాంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సిద్దన్న, సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు చిరంజీవి, పిల్లోడి విశ్వనాథ్, అమర్ నాథ్ రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.