31-05-2025 03:39:20 PM
ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్రావు
మహబూబాబాద్,(విజయక్రాంతి): అభివృద్ధి కార్యక్రమాలు ప్రజామోదంగా ఉండాలని, చేసిన పనులు చిరకాలం ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని, అప్పుడే చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడే విధంగా నిలుస్తాయని ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు(MLC Takkallapalli Ravinder Rao) అన్నారు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలోని వివిధ కూడళ్ళలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన శనివారం పరిశీలించారు. అలాగే రైల్వే స్టేషన్ లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ(BRS Government) హాయంలో మానుకోట సమగ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు.
ఇప్పుడు కూడా ప్రణాళిక బద్ధంగా పట్టణ పురోగతి కోసం చేపట్టే పనులకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. దూరదృష్టితో భవిష్యత్ కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులను చేపట్టాలని కోరారు. అలాగే రైల్వే స్టేషన్ లో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేయడంతో పాటు విస్తరిస్తున్న రైల్వే లైన్లకు అనుగుణంగా ఫ్లాట్ ఫారాల సంఖ్య పెంచాలని, రైల్వే ట్రాక్ కు ఇరువైపులా విస్తరించి ఉన్న పట్టణ ప్రజలు ట్రాక్ దాకేందుకు ప్రత్యేకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి(Foot Over Bridge) నిర్మించాలని రైల్వే అధికారులను కోరారు. ఈ మేరకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మారినేని వెంకన్న, బీ ఆర్ ఎస్ నాయకులతో కలిసిజిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ను కలిసి వినతి పత్రం అందజేశారు.