calender_icon.png 2 June, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అహల్య బాయి హోల్కర్ గూర్చి తెలుసుకోండి

31-05-2025 03:47:30 PM

300 ఏళ్ల క్రితమే మన దేశాన్ని కాపాడిన మహోన్నత వ్యక్తి 

అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): అహల్యాబాయి హోల్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా చేయడం చాలా సంతోషంగా ఉందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలను పురస్కరించి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ... ఎంతోమంది వీరుల చరిత్ర మరుగున పడిపోయిందని ఆ చరిత్రను వెలుగులోకి బీజేపీ తీసుకువస్తుందని తెలిపారు. వారి స్ఫూర్తిని ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని,  300 చరిత్రలో కూడా అహల్యాబాయి హోల్కర్ ఎన్నో బాధ్యతలను చిన్నతనం నుంచి భరించిందన్నారు.

ఎనిమిదేళ్ల వయసులోనే అహల్యాబాయికి పెళ్లి జరిగిందని, రాజ్యంలో పూర్తిస్థాయిలో ఆర్థిక విషయాలను 15 యేండ్లకే వారి మామ అనేక బాధ్యతలను అప్పగించడం జరిగిందని తెలిపారు. 29 యేండ్ల లోపు ఆమె భర్త మరణించడం, ఆ కాలంలో సతీసహగమనం ఉండేదని, వారి మామా ఒప్పుకోలేదన్నారు. ఎంతోమంది పేదలను కాపాడిన మహోన్నత వ్యక్తి అహల్య బాయి అని కొనియాడారు. అనేక దేవాలయాలను దేశ వ్యాప్తంగా నిర్మించడం జరిగిందన్నారు. ఆమె పెదల ప్రజల పక్షాన నిలబడిందన్నారు.

చేనేత పరిశ్రమలను ప్రోత్సహించడం, గొప్ప తెలివి తేటలు ఉన్న పుణ్య శ్లోక, లోకమాత రాణి అహల్యాబాయి హోల్కర్ అని కొనియాడారు. గొప్ప వాళ్ళ చరిత్ర తెలుసుకొని మంచి నడవడికలతో ముందుకు సాగిన అవసరమైన చర్యలు బీజేపీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. అనేక యుద్ధాలను చేసి ఈ ప్రాంతాన్ని కాపాడిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని అందరికి తెలిసిన చేసినందుకు జాతీయ అధ్యక్షురాలు జేపీనడ్డా కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బాల త్రిపుర సుందరి, పద్మజా రెడ్డి, బాలవర్ధన్ గౌడ్, వీర బ్రహ్మచారి,  కిరణ్ కుమార్ రెడ్డి, అంజయ్య, తదితరులు ఉన్నారు.