27 July, 2026 | 12:20 PM

Breaking News

డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •  

వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

30-12-2025 02:38 PM

కేసముద్రం,(విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని అమీనాపురం శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివచ్చి స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అర్చకులు ప్రత్యేకంగా ఉత్సవమూర్తులను అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. వందల సంఖ్యలో భక్తులు దేవాలయానికి తరలి రావడంతో దేవాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.