14-06-2025 01:12:48 AM
- సీటు విరగడంతో దూరంగా ఎగిరిపడ్డా
- విమాన ప్రమాద మృత్యుంజయుడు విశ్వాస్
న్యూఢిల్లీ, జూన్ 13: గుజరాత్ విమానప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ మృ త్యుంజయుడు విశ్వాస్కుమార్ రమేశ్, ప్రస్తు తం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో.. విమానం కూలగానే తాను కూర్చు న్న సీటు ఊడి పడిందని, అందుకే తాను బతికి బయటపడ్డానని పేర్కొన్నారు.
‘నేను విమానం నుంచి కిందికి దూకలేదు, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ముక్కలైంది. నా సీటు విరిగిపడటంతో దూరంగా ఎగిరిపడ్డా. అందుకే విమానంలో చెలరేగిన మం టలు నాకు అంటుకోలేదు’ అని విశ్వాస్కుమార్ పేర్కొన్నారు. ‘అంతా నా కళ్ల ముందే జరిగింది. ఎలా బతికానో నాకే తెలీదు. విమానం కింద పడగానే నేను కూడా చనిపోయానని అనుకున్నా.
కండ్లు తెరిచి చూసేసరికి హాస్టల్ బిల్డింగ్ శిథిలాల్లో ఉన్నా. అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లా. మంటల దాటికి నా ఎడమ చేయికి గాయమైంది’ అని విశ్వాస్ పేర్కొన్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ను శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ పరామర్శించారు. ప్రమాద వివరాలు, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.