14-06-2025 01:10:28 AM
- వేర్వేరు విమాన ప్రమాదాల్లో మాజీ సీఎంల మృత్యువాత
- 1965లో బల్వంతరాయ్ మెహతా విమానం కూల్చేసిన పాక్
- తాజా విమాన ప్రమాదంలో కన్నుమూసిన విజయ్ రూపానీ
అహ్మదాబాద్, జూన్ 13: గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూ పానీ ప్రాణాలు కోల్పోయారు. లండన్లో ఉన్న తన కూతురును చూసేందుకు వెళ్తూ విమాన ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
గతంలోనూ విమాన ప్రమాదాల్లో రాజకీయ నాయకులు మృతి చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇదే గుజరాత్కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఇద్దరు వేర్వేరు విమాన ప్రమాదాల్లో కన్నుమూయడం గమనార్హం. 60 ఏళ్ల కిందట 1965లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి బల్వంతరాయ్ మెహతా తన కుటుంబంతో ప్రయాణిస్తున్న చాపర్ను పాకిస్థాన్ కూల్చేయగా.. తాజాగా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విజయ్ రూపానీ అకాల మరణం చెందారు.
పొరపాటున భారత్ సరిహద్దులోకి..
1965 ఆగస్టులో భారత్ మ ధ్య మొదలైన యుద్ధం సెప్టెంబర్ నాటికి తీ వ్రతరమైంది. అదే సమయంలో సెప్టెంబర్ 19న గుజరాత్ ముఖ్యమంత్రి బల్వంతరాయ్ మెహతా, ఆయన భార్య సరోజ్ బెన్, ముగ్గురు సహాయకులు, ఇద్దరు జర్నలిస్టులతో కలిసి చాపర్లో మిథాపూర్కు బయల్దేరారు. కాగా చాపర్ను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ పైలట్ జహంగీర్ నడిపారు. అయితే ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న చాపర్ పొరపాటున యుద్ధ వాతావరణం నెలకొన్న భా రత్ సరిహద్దులోకి వెళ్లింది.
దీన్ని గమనించిన పాకిస్థాన్ ఎయిర్ఫోర్స్ ఫ్లయింగ్ ఆ ఫీసర్ ఖాయిస్ హుస్సేన్.. బల్వంతరాయ్ ప్ర యాణిస్తున్న చాపర్ను నిఘా జెట్గా భా వించి యుద్ధ విమానంతో దూసుకొచ్చారు. బల్వంతరాయ్ చాపెల్ నుంచి సిగ్నల్ వెళ్లినా పాక్ ఎయిర్ఫోర్స్ కాల్పులు జరపడంతో బ ల్వంతరాయ్ సహా 8 మంది దుర్మరణం చె ందారు. అయితే ఆ చాపర్లో ఉన్న వ్యక్తి సీ ఎం బల్వంతరాయ్ అన్న సంగతి పాక్ ఆఫీసర్ ఖాయిస్ హుస్సేన్కు తెలియకపోవడం గమనార్హం. ఇది జరిగిన 46 ఏళ్ల తర్వాత ఆ చాపర్ నడిపిన ఇంజినీర్ జహంగీర్ కుమార్తెకు ఖాయిస్ హుస్సేన్ క్షమాపణలు చె ప్పడం గమనార్హం.
గతవారమే లండన్ వెళ్లాల్సిన రూపానీ..
లండన్లో ఉన్న కూతురును కలిసేందు కు విజయ్ రూపానీ గత వారమే విమానం ఎక్కాల్సింది. కానీ పంజాబ్కు ఇన్చార్జీ మ ంత్రిగా వ్యవహరిస్తున్న రూపానీ లుథియా నా వెస్ట్ ఉప ఎన్నిక కోసం ఆగిపోవాల్సి వ చ్చింది. ఆయన భార్య మాత్రం గతవారం ల ండన్ విమానం ఎక్కారు. భార్యతో పాటు వె ళ్లాల్సిన రూపానీ వారం తర్వాత గురువారం లండన్ ఫ్లుటై ఎక్కారు. కానీ క్షణాల వ్యవధిలోనే విమానం కుప్పకూలండంతో అకాల మరణం చెందారు.
ఇక విజయ్ రూపానీ లక్కీ నంబర్ 1206 అని ఆయనే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆయన ఏ నంబర్ అయితే తన అదృష్ట సంఖ్యగా భావించారో ఆ సంఖ్యే ఇప్పుడు ఆయన ప్రాణాలను బలి తీసుకుంది. తన ఇంట్లోని స్కూటర్ల నుంచి కార్ల దాకా అన్ని వాహనాలకు 1206 నంబరే ఉంది. ప్రమాదం జరిగిన తేదీ జూన్ 12. ఆ ంగ్లంలో ఈ సంఖ్యను 12 రాస్తాము. అనూహ్యంగా ఆయన చివరి ప్రయాణం 1206 సంఖ్యతో ముగియడం దురదృష్టకరం.