17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ట్యాంకర్ బోల్తా.. రోడ్డు పాలైన వేలాది లీటర్ల డీజిల్

16-12-2024 03:42 PM

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌-మెట్టుగూడ మధ్య రైలు నిలయం సమీపంలో సోమవారం డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడటంతో వేలాది లీటర్ల డీజిల్ వృథా అయింది. డీజిల్‌తో నిండిన రహదారిపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.  వివరాల్లోకి వెళితే... సోమవారం ఉదయం సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ వద్ద డీజిల్‌తో కూడిన ట్యాంకర్ బోల్తా పడడంతో ఉద్రిక్తత నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నీటిని పోసి ఇంధనాన్ని పలుచన చేసి మంటలను అరికట్టారు. 

ఘట్‌కేసర్‌ నుంచి నగరానికి వెళ్తున్న ట్యాంకర్‌ మెట్టుగూడ వద్ద బోల్తా పడింది. ట్యాంకర్ పేలి పోతుందని భయంతో జనాలు పరుగులు తీశారు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమీప అగ్నిమాపక కేంద్రాల నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో ట్యాంకర్‌ను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో సికింద్రాబాద్‌ నుంచి తార్నాక రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసు ఉన్నతాధికారులు అదనపు ట్రాఫిక్ పోలీసులను సంఘటనా స్థలానికి పంపారు.