26-10-2025 06:36:37 PM
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని కేకే ఓసీపీని సింగరేణి డైరెక్టర్ (పీ&పీ) ప్రాజెక్ట్ ప్లానింగ్ కె వెంకటేశ్వర్లు సందర్శించారు. ఆదివారం ఓసీపీని సందర్శించిన ఆయన ప్రాజెక్ట్ స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓసిపి వ్యూ పాయింట్ నుండి మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించారు. అదేవిధంగా, ఆఫ్లోడింగ్ ఎక్స్ప్రెస్వే ప్రతినిధులను వెంటనే ఓబీ వెలికితీత పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఎం మల్లయ్య, ఇన్ఛార్జ్ మేనేజర్ శ్రీధర్ గౌడ్, సేఫ్టీ ఆఫీసర్ ఎన్ పైడయ్య, ఎక్స్ప్రెస్వే ప్రతినిధులు పాల్గొన్నారు.