12-08-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి, ఆగస్టు 11 (విజయక్రాంతి):జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా టేకులపల్లి మండలం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పిల్లలకు నులిపురుగుల నివారణ కొరకు ఆల్బెండజోల్ మాత్రలను పిల్లలకు నోటి ద్వారా మింగించి ప్రారంభించారు.
వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ నేతృత్వంలోని వైద్య సిబ్బంది ఈ సందర్భంగా పిల్లలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించినట్లయితే చాలా వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని కాబట్టి పిల్లలందరూ స్కూల్ పరిసరాలు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిల్లల పొట్టలో నులిపురుగులు ఉండడంవల్ల రక్తహీనత వయసుకు తగ్గ ఎదుగుదల లేకపోవడం, మగత, అలసట తరచూ వ్యాధుల బారిన పడటం తద్వారా చదువుల్లో ఆటల్లో వెనుకబడిపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు.
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నులి పురుగుల నివారణ టాబ్లెట్లను సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసు పిల్లలు అందరూ తప్పనిసరిగా మింగాలని తెలిపారు. నులి పురుగుల నివారణకు తినేటప్పుడు త్రాగేటప్పుడు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులు పరిశుభ్రం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డిని ఉపయోగించుకోవాలని పండ్లు కూరగాయలు పరిశుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించుకోవాలని పిల్లలకు ఆరోగ్య విద్యా బోధన చేశారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కందుల దినేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు, ఉపాధ్యాయులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి, ఆరోగ్య విస్తరణ అధికారి దేవా, సూపర్వైజర్ గుజ్జ విజయ, నాగు బండి వెంకటేశ్వర్లు, కోరం సురేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీ లాల్ నాయక్, రెడ్యానాయక్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.