calender_icon.png 24 November, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో దుప్పట్లు, పండ్ల పంపిణీ

24-11-2025 12:09:45 AM

సుల్తానాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): శ్రీ సత్య సాయి బాబా 100 వ జయంతి నీ పురస్కరించుకొని ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో పేషంట్ల కు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్లు, డోర్ మ్యాట్లు పంపిణీ చేయడం జరిగింది...పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ ఆవరణలో గల వాసవి మాత దేవాలయం లో ముందు గా సత్య సాయి బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం  భజనలు చేయడం జరిగింది... ఆర్యవైశ్య భవన్ నుండి ద్విచక్ర వాహనాల ర్యాలీ తో పోలీస్ స్టేషన్ మీదుగా ఆసుపత్రి వరకు చేరుకోవడం జరిగింది.

లాలపల్లి వాస్తవ్యులు క్రీస్తు శేషులు అల్లెంకి సుశీల-భూమయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బంధువుల తోపాటు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగ గా నిర్వహించడం జరిగింది... ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడు తూ పుట్టపర్తి సాయిబాబా 100వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు... ఆ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకోవడం జరిగింది... ఈ కార్యక్రమంలో ఆస్పత్రి డాక్టర్.. సిబ్బంది , ఆర్యవైశ్య సంఘం నాయకులు.. సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు....