calender_icon.png 24 July, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం ప్రతి పేదవాడి కంచంలో మెతుకైంది..

23-07-2025 06:48:24 PM

సంక్షేమ పథకాలు నిజమైన పేదవాళ్లకు వెళ్ళాలి.. దళారుల చేతికి వెళ్లొద్దు..

పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు రాలేదు..

పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే బీఆర్ఎస్ ఓర్వలేక పోతుంది..

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

మునుగోడు (విజయక్రాంతి): గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యం దళారుల చేతిలోకి వెళ్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం ప్రతి పేదవాడి కంచంలో మెతుకైందని, పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. బుధవారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని అధికారిక క్యాంపు కార్యాలయంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మండల వ్యాప్తంగా 1828 నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. నాడు వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇచ్చిందని అన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇస్తున్నాం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది.

పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు రాలేదు, కేవలం ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలు అందించారు. పేదలకు అండగా ఉండడానికి ప్రతిక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే వేలకు వేల రూపాయలు దళారుల చేతిలోకి వెళ్లాయి, ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిబద్దతతో పనిచేస్తుంది. నాడు వైయస్ హాయంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు వచ్చాయి. నేడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుంది. నిబంధనల వల్ల చిన్న చిన్న కారణాలతో నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇల్లులు రాలేదు, వాటిని సడలించి నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డు ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది,నేను ఎమ్మెల్సీ ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాం, పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు.

రేషన్ కార్డు అనేది పేదవాళ్లకు చాలా ముఖ్యమైనది..

-ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం 

గత పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ జరగలేదు, కేవలం ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలు అందించేది గత ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా ఉప ఎన్నికలతో ముడిపెట్టేది, సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా లబ్ధిదారులకు అందేలా చూడాలనే అభిప్రాయంతో శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. కులాలకతీతంగా పార్టీలకతీతంగా లబ్ధిదారులకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఇద్దరమ్మా ఇరుల విషయంలో చాలామంది పేదలు ఇంకా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి ప్రతి ఒక్క పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, నిరుపేదల విషయంలో ఇందిరమ్మ ఇల్లుల నిబంధనలు సడలించాలి.

ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం సంతోషమైన విషయం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా లేదు, కానీ రాజ్ గోపాల్ రెడ్డి నాయకత్వంలో బెల్ట్ షాపులన్నీ నిర్మూలించడం గొప్ప విషయం అని అన్నారు. అందరూ సహకరిస్తే కచ్చితంగా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో శ్రీదేవి, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.