20 March, 2026 | 10:34 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

'మోడల్' విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్

23-04-2025 10:48 PM

మందమర్రి (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పట్టణంలోని తెలంగాణ మోడల్ కాలేజ్ విద్యార్థులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అభినందించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.

ప్రైవేటు కళాశాలలకు  దీటుగా ఆదర్శ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించి జిల్లాకు వన్నె తీసుకువచ్చారని వారిని ప్రత్యేకంగా అభినందించారు. కాగా అత్యుత్తమ మార్కులు సాధించిన వారిలో ఎంపీసీ లో జి అనూష 987 మార్కులు, టి హర్షిత 982 మార్కులు, బీపీసీలో పి వైశాలి 986 మార్కులు, ఎం హాసిని 973 మార్కులు, సిఈసి లో ప్రతిమాదేవి 932 మార్కులు, కే శ్రీనిధి 927 మార్కులు సాధించారు. వీరిని ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సారా తస్నీమ్, అధికారులు పాల్గొన్నారు