24-04-2025 12:00:00 AM
లక్షెట్టిపేట, ఏప్రిల్ 23: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం పట్టణంలో చోటు చేసుకుందని ఎస్సై సురేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గోదావరిరోడ్డుకు చెందిన ఇంటర్ విద్యార్థిని పందిరి అశ్విత (౧౭) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు పట్టణంలోని వాగేశ్వరి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
మంగళవా రం విడుదల చేసిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మృతురాలు ఇంగ్లీషు ప్రాక్టికల్స్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి పందిరి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సురేష్ తెలిపారు.