17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

11-12-2025 04:36 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఖానాపూర్ డివిజన్ లోని గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం తనిఖీ చేశారు. మామడ లక్ష్మణ చందా ఖానాపూర్ పెంబి దస్తురాబాద్ తదితర మండలంలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన కలెక్టర్.. క్యూలైన్ లో నిలబడ్డ ఓటర్లతో పలకరించి అక్కడ ఉన్న సౌకర్యాలను ఓటింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా సిబ్బంది సహకరించాలని సూచించారు. కౌటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్న కళ్యాణి అధికారులు ఉన్నారు.