26-05-2025 01:10:14 AM
కరీంనగర్, మే 25 (విజయక్రాంతి): క రీంనగర్ సప్తగిరి కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామ పా లన అధికారుల(జి. పి.ఓ) నియామక పరీక్ష ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదివారం పరిశీలించారు. గత ప్రభుత్వం రద్దు చేసిన వీ ఆర్వో, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు, గ్రామాల్లో రెవిన్యూ సేవల పునరుద్ధరణ కోసం గ్రామ పాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం స న్నాహాలు చేస్తున్నది.
ఈ మేరకు జిపిఓ పో స్టులకు దరఖాస్తు చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏలకు ఆదివారం సప్తగిరి కాలనీలోని జడ్పీ హెచ్ఎస్ లో రాత పరీక్ష నిర్వహించారు. 18 9 మంది వీఆర్వో, వీఆర్ఏలు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోగా 172 మంది పరీక్షకు పరీక్షకు హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, డిఆర్వో ప వన్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, డివైఎస్ఓ శ్రీనివా స్, ఏవో సుధాకర్పాల్గొన్నారు.