10 May, 2026 | 5:48 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ప్రజల ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యమా

15-09-2025 07:25 PM

జిల్లా వాహనదారుల ఆవేదన..

జనగామ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో జనగామ నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిలో సురక్ష హాస్పిటల్, సమీపంలో నిత్యం ప్రజలు ప్రయాణించే రోడ్డు మార్గంలో, డివైడర్ వర్క్ జరుగుతున్న సమయంలో భారీ గుంత తీసి అసంపూర్తిగా పూర్తిచేసి వదిలివేయడం జరిగింది. దీనివలన జిల్లా కేంద్రంలో హైదరాబాద్ ప్రధాన రహదారి మరియు నిత్యం జనావాసాలు, తిరిగే ప్రదేశం కాబట్టి డివైడర్ చూడకుండా సడన్గా వాహనదారులు యూటర్న్ తీసుకుంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇప్పటివరకు రోడ్డు, భవనాలు రహదారుల శాఖ, మున్సిపల్ శాఖ, కనీసం పోలీస్ శాఖ అయిన ఎటువంటి హెచ్చరిక గుర్తులను ఏర్పరచలేదు, ప్రజల ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యం, ఎందుకని వాహనదారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులపై వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకొని డివైడర్ వర్క్ ను ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే త్వరితగతిన పూర్తి చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.